వైరల్ అవుతున్న త్రిష పోస్ట్
- త్రిష పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
- టీవీకే ఘన విజయంతో మరింత ప్రత్యేకంగా మారిన బర్త్ డే
- విజయ్ ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించే అవకాశం
నటి త్రిష పుట్టినరోజు వేడుకలు, ఆమె తాజా సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోమవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడంపై త్రిష తాజాగా స్పందించారు. తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటి ఆదరణ పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తన ఇన్స్టా స్టోరీలో ఒక ప్రత్యేక నోట్ను పంచుకున్నారు. తిరుమల తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. త్రిష షేర్ చేసిన తిరుమల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, త్రిష పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నటి రాధిక, వరలక్ష్మి శరత్కుమార్, ఛార్మి, మంచు లక్ష్మి వంటి వారు ఆమెకు విషెస్ తెలుపుతూ, ఈ ఏడాది పుట్టినరోజు ఆమెకు ఒక అద్భుతమైన కానుకను ఇచ్చిందని, ఇది ఆమె జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక రెండు రోజుల క్రితం వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో, త్రిషకు ఈ పుట్టినరోజు అత్యంత ప్రత్యేకంగా నిలిచిందనే చర్చ నడుస్తోంది. విజయ్ ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించబోతోందనే చర్చ జరుగుతోంది.